ప్రేమ కోసం ఆ ఇంజినీరింగ్ విద్యార్థుల పాట్లు.. గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఎంతకు తెగించారంటే..

ABN , First Publish Date - 2022-03-08T05:46:57+05:30 IST

ప్రేమలో పడిన వారికి ఆలోచన దూరమవుతుందంటారు. ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు ప్రియుడు ఎంతకైనా తెగిస్తాడంటారు. ప్రేమలో అన్ని హద్దులు దాటేందుకు యువకులు ప్రయత్నిస్తారు...

ప్రేమ కోసం ఆ ఇంజినీరింగ్ విద్యార్థుల పాట్లు.. గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఎంతకు తెగించారంటే..

ప్రేమలో పడిన వారికి ఆలోచన దూరమవుతుందంటారు. ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు ప్రియుడు ఎంతకైనా తెగిస్తాడంటారు. ప్రేమలో అన్ని హద్దులు దాటేందుకు యువకులు ప్రయత్నిస్తారు. తాజాగా అయిదుగురు యువకులు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను సంతోషపెట్టడానికి నేరస్తులుగా మారారు. 


వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా కొత్వాలి ప్రాంతంలో అయిదుగురు ఇంజినీరింగ్ యువకులు ప్రేమలో పడి మంచి చెడు అనే విచక్షణ కోల్పోయారు. మిగతా విద్యార్థుల్లాగానే రోజూ కాలేజీకి వెళ్లే ఈ యువకులు తాము ప్రేమించిన యువతులను ఇంప్రెస్ చేయడానికి, వారి కోరికలు తీర్చడానికి దొంగలుగా మారారు.  ప్రేమలో పడి భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. గోండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ దోపిడీలకు, చైన్ స్నాచింగ్‌లకు, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు.


దోపిడీ ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిఘా పెట్టారు. చోరీ చేస్తూ దొరికిపోయిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ విచారణలో ఆ యువకుడు మిగతా వారి పేర్లను బయటపెట్టేశాడు. దీంతో గ్యాంగ్ మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 9 మొబైల్స్‌ను, 2 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆ యువకులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

Updated Date - 2022-03-08T05:46:57+05:30 IST