రేకుల షెడ్డులో చదువులు

ABN , First Publish Date - 2022-08-19T05:38:08+05:30 IST

పట్టణంలోని నెహ్రు మెమోరియల్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో గదులు చాలకపోవడంతో ఆరుబయట రేకుల షెడ్డు కింద కూచొని విద్యార్థులు పాఠాలు వినాల్సి వచ్చింది.

రేకుల షెడ్డులో చదువులు
రేకుల షెడ్డు కింద కూర్చున్న విద్యార్థులు

ఆదోని అగ్రికల్చర్‌, ఆగస్టు 18: పట్టణంలోని నెహ్రు మెమోరియల్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో గదులు చాలకపోవడంతో ఆరుబయట రేకుల షెడ్డు కింద  కూచొని విద్యార్థులు పాఠాలు వినాల్సి వచ్చింది.  అవి కూడా చాలక ఎర్రటి ఎండకు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. 2019 మంది విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకుం టున్నారు. 23 గదులు మాత్రమే ఉన్నాయి. ఒక్కో గదిలో 120 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులు కిక్కిరిసిపోయాయి. నాడు-నేడు మొదటి విడత కింద రూ.96 లక్షల ఖర్చుతో రూపు రేఖలు మార్చుకున్నారు. గదులు మాత్రం నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. రెండో విడత నాడు-నేడు కింద ఎంపికైంది. 21 అదనపు గదులను నిర్మించేందుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. అధికారులు పాఠశాలల పునఃప్రారంభం కాక మునుపు గదుల నిర్మాణం చేపట్టకుండా ఇప్పుడు పునాదులు తవ్వే పనులు ప్రారంభించారు. ఎప్పుడు పనులు పూర్తయి.. గదుల సమస్య ఎప్పుడు తీరాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-08-19T05:38:08+05:30 IST