పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి

ABN , First Publish Date - 2022-09-25T04:03:07+05:30 IST

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి గొల్ల హిమబిం దు విద్యార్థులకు సూచించారు. శనివారం మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటశా లలను తనిఖీ చేశారు.

పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి
విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలిస్తున్న జడ్జి హిమబిందు

బెల్లంపల్లి రూరల్‌, సెప్టెంబరు 24: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి గొల్ల హిమబిం దు విద్యార్థులకు సూచించారు. శనివారం మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటశా లలను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన విద్యను అందించా లన్నారు. ప్రధానోపాధ్యాయులు నిరోష, సిబ్బంది పాల్గొన్నారు.  

చెన్నూరు: గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని చెన్నూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమగురుకుల బాలికల పాఠశాలను తని ఖీ చేశారు. సౌకర్యాలు, వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గది శుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచిం చారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలు, ఇబ్బందుల గురించి హైకోర్టుకు నివేదిక సమర్పిస్తానని పేర్కొన్నారు. 

 

Updated Date - 2022-09-25T04:03:07+05:30 IST