పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి

ABN , First Publish Date - 2022-08-13T05:57:26+05:30 IST

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు.

పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
విద్యార్థులతో కలిసి రాఖీ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌ పమేలా సత్పథి

ఆలేరు రూరల్‌, ఆగస్టు 12: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు. మండలం లోని మందనపల్లిలో బ్యాక్‌ టూ బ్యాక్‌ బాలల సంరక్షణ  కేంద్రంలో బాలికలతో కలిసి  శుక్రవారం రాఖీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలకు చేరు కోగలిగినప్పుడే ఆనందం కలుగుతుందన్నారు. మనకు మనం  రక్షణ  చర్యలు  తీసుకుంటూ ఇతరులకు రక్షణగా నిలువాలన్నారు. అనాధ బాలికల ఆశ్రమంలో రాఖీ ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన ఘనం గా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్‌ బండారు జయశ్రీ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి  సైదులు, సర్పంచ్‌ కోటగిరి పాండరి, ఎంపీడీవో జ్ఞానప్రకాశ్‌, ఎంపీవో సలీం, సభ్యులు మల్లేశం, ఉప సర్పంచ్‌ సత్యనారాయణ, ఆశ్రమ నిర్వాహకుడు దేవదాసు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:57:26+05:30 IST