పెనమలూరులో సబ్‌ కలెక్టర్‌ ఆకస్మిక పర్యటన

ABN , First Publish Date - 2021-07-25T05:56:59+05:30 IST

పెనమలూరులో సబ్‌ కలెక్టర్‌ ఆకస్మిక పర్యటన

పెనమలూరులో సబ్‌ కలెక్టర్‌ ఆకస్మిక పర్యటన
మృతుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు

 పెనమలూరు, జూలై 24 : సబ్‌ కలెక్టర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌ ఆకస్మికంగా పర్యటిం చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కౌలు రైతు ఎం నాగభూషణం ఆత్మహత్య ఘటనపై విచారిం చడానికి శనివారం రైతు నివాసానికి వెళ్లారు. విజయవాడ సెంట్రల్‌ ఏసీపీ ఖాదర్‌ బాషా, వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సునీల్‌తో కలసి మృతుని కుటుంబ సభ్యుల నుంచి  వివరాలు సేకరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు 102 ప్రకారం ఆర్థికసాయం అందజేయడానికి విచారణ చేపట్టినట్లు సబ్‌ కలెక్టర్‌ తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈ - పంట నమోదు తీరును పరిశీలించారు. పెనమలూరు - 1 సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కోసం అమలు చేస్తున్న రిజిష్టర్లను పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో  సర్పంచ్‌ లింగాల భాస్కరరావు, తహసీల్దారు భద్రు, సీఐ సత్యనారాయణ, మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T05:56:59+05:30 IST