సీనియర్‌ జర్నలిస్టు సుబ్బారాయుడు జీవిత సహచరి శోభ కన్నుమూత

ABN , First Publish Date - 2022-06-25T09:32:40+05:30 IST

సీనియర్‌ జర్నలిస్టు సుబ్బారాయుడు జీవిత సహచరి శోభ కన్నుమూత

సీనియర్‌ జర్నలిస్టు సుబ్బారాయుడు జీవిత సహచరి శోభ కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): మార్క్సిస్టు రచయిత, సీనియర్‌ జర్నలిస్టు ఎస్వీఎస్‌ సుబ్బారాయుడు జీవిత సహచరి శోభ(74) హఠాన్మరణం చెందారు. ఆమె గురువారం ఇక్కడి స్వగృహంలో కుటుంబసభ్యులతో మాట్లాడుతూనే తుదిశ్వాస విడిచారు. శోభ హిందీ పండిట్‌గా పనిచేసి 2006లో పదవీ విరమణ పొందారు. వీరిది కులాంతర వివాహం. సుబ్బారాయుడు కొంతకాలం కిందట కన్నుమూశారు. తన జీవిత సహచరుడితో కలిసి శోభ విప్లవ కమ్యూనిస్టు పార్టీ పోరాటాల్లో పాల్గొన్నారు. శోభ మరణం పట్ల యూసీసీఆర్‌ఐ(ఎంఎల్‌) పార్టీతో పాటు సీపీఐ(ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ తెలంగాణ కార్యవర్గ సభ్యులు సంతాపం ప్రకటించారు. శోభ అంత్యక్రియలు గురువారం సాయంత్రం అంబర్‌పేటలోని శ్మశానవాటికలో ముగిసినట్లు కుమార్తెలు తెలిపారు. 

Updated Date - 2022-06-25T09:32:40+05:30 IST