ఎస్వీయూ దూరవిద్య డైరెక్టర్గా సుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2021-03-09T08:10:49+05:30 IST
ఎస్వీయూనివర్సిటీ దూరవిద్య విభాగం డైరెక్టర్గా ప్రొఫెసర్ ఎస్వీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 8: ఎస్వీయూనివర్సిటీ దూరవిద్య విభాగం డైరెక్టర్గా ప్రొఫెసర్ ఎస్వీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు డైరెక్టర్గా వ్యవహరించిన ప్రొఫెసర్ తవమణి సెలవుపై వెళ్లడంతో ఆ స్థానంలో సుబ్బారెడ్డిని నియమించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ పి.శ్రీధర్రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో సుబ్బారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించగా, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.