సుబ్బారెడ్డి సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-11-26T05:19:46+05:30 IST

మండలంలోని రాచర్ల గ్రామానికి చెందిన జి.సుబ్బారెడ్డి (50) ఉపాధ్యాయుడిగా అందించిన సేవలు మరువలేని వని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

సుబ్బారెడ్డి సేవలు మరువలేనివి

మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

రాచర్ల, నవంబరు 25 : మండలంలోని రాచర్ల గ్రామానికి చెందిన జి.సుబ్బారెడ్డి (50) ఉపాధ్యాయుడిగా అందించిన సేవలు మరువలేని వని  మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. రాచర్ల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనుమలవీడు  జిల్లా పరషత్‌ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి గుం డెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. విషయం తెలుసుకున్న అశోక్‌రెడ్డి సుబ్బారెడ్డి మృతి దేహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనుమలవీడు ప్రధానోపాధ్యాయుడు రా మసుబ్బారెడ్డితోపాటు విద్యార్థులు కన్నీటి వీడ్కోలు పలికారు.  యూటీ ఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ రమణరెడ్డి, వైసీపీ నాయకులు ప్రవీన్‌కుమార్‌రెడ్డి నివాళులర్పించారు. 


Updated Date - 2021-11-26T05:19:46+05:30 IST