ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలి

ABN , First Publish Date - 2022-08-13T06:02:13+05:30 IST

గంగిరెద్దుల వారు ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలను అందించాలని గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకయ్య ప్రభుత్వాన్ని కోరారు.

ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

సిద్దిపేట అగ్రికల్చర్‌, ఆగస్టు 12: గంగిరెద్దుల వారు ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలను అందించాలని గంగిరెద్దుల సంఘం  రాష్ట్ర అధ్యక్షుడు కనకయ్య ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్‌ క్లబ్‌ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంగిరెద్దుల పిల్లలకు గురుకుల పాఠశాలలో అడ్మిషన్‌ ఇప్పించాలని ఆయన కోరారు. జిల్లాలో అలాగే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల సంఘం జిల్లా నూతన కమిటీనీ ఎన్నికున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా కాశిం, కోశాధికారిగా వెంకటేశం, కార్యదర్శిగా రవీందర్‌, అధికార ప్రతినిధిగా మధు, గౌరవ అధ్యక్షులుగా సారయ్యలను ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.

 

Updated Date - 2022-08-13T06:02:13+05:30 IST