మూలన పడేశారు..!

ABN , First Publish Date - 2021-04-17T04:44:17+05:30 IST

టీడీపీ హయాంలో రైతులకు ఆదరణ పథకం కింద మంజూరైన రాయితీ పరికరాలను ఎవరికీ అందించకుండా మూలన పడేశారు.

మూలన పడేశారు..!
ఎంపీడీవో కార్యాలయంలో మూలన ఉన్న పరికరాలు

మద్దికెర, ఏప్రిల్‌ 16: టీడీపీ హయాంలో రైతులకు ఆదరణ పథకం కింద మంజూరైన రాయితీ పరికరాలను ఎవరికీ అందించకుండా మూలన పడేశారు. మద్దికెర ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రైతులకు సంబంధించి జొన్న సొప్పను తొలగించే యంత్రాలను ఎవరికీ ఇవ్వకుండా మూలనపెట్టారు. వీటి ధర ఒక్కొక్కటి రూ.14వేలు, అయితే సదరు బీసీలు 10శాతం రాయితీ రూ.1400 చెల్లిస్తే ఈ పరికరాలను అందించాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఎవరికీ ఇవ్వకపోవడంతో రోజురోజకు తుప్పుపట్టిపోతున్నాయి. అలా మొత్తం 6 యంత్రాలు ఉన్నాయి. ఇప్పటి కైనా అధికారులు స్పందించి అర్హులకు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఎంపీ డీవో నరసింహమూర్తిని వివరణ కోరగా గత ప్రభుత్వ హయాంలో వచ్చాయని, అందుకు సంబంధించిన వివరాలను తెప్పించుకుని అందిస్తామని తెలిపారు.

Updated Date - 2021-04-17T04:44:17+05:30 IST