ఆన్‌లైన్‌ ఈ-కటా చాంపియన్‌షిప్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-04-19T04:40:10+05:30 IST

మొదటి ఇంటర్నేషనల్‌ ఆన్‌లైన్‌ ఈ-కటా చాంపియన్‌షిప్‌ పోటీ ల్లో నారాయణపేటకు చెందిన 80 మంది కరాటే విద్యార్థులు పాల్గొని ప్రతిభను చాటినట్లు మాస్ట ర్‌ బాలరాజు తెలిపారు.

ఆన్‌లైన్‌ ఈ-కటా చాంపియన్‌షిప్‌ విజయవంతం
ఆన్‌లైన్‌ ఈ కటా చాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటి వివిధ పతకాలు సాధించిన విద్యార్థులతో సీఐ, ఎంపీపీ, మాస్టర్లు

నారాయణపేట, ఏప్రిల్‌ 18 : మొదటి ఇంటర్నేషనల్‌ ఆన్‌లైన్‌ ఈ-కటా చాంపియన్‌షిప్‌ పోటీ ల్లో నారాయణపేటకు చెందిన 80 మంది కరాటే విద్యార్థులు పాల్గొని ప్రతిభను చాటినట్లు మాస్ట ర్‌ బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని సిటిజన్స్‌ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ప్రతిభ కనబరచిన 80 మంది విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు. అందులో బంగారు పతకాలు 50 మందికి, వెండి పతకాలు 30 మందికి అందించారు. తెలంగాణ రాష్ట్ర వేదికగా ఈనెల 2 నుంచి 9వరకు మాస్టర్‌ కేశవ్‌ కరాటే అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఆన్‌లైన్‌ ఈ-కటా చాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌తో పాటు ఇతర 25 దేశాల నుంచి 2700 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులను వారు అభినందించారు. కార్యక్రమంలో జూని యర్‌ మాస్టర్స్‌ అస్లాం, సోహైల్‌, మహేష్‌, పాషా, సంతోష్‌, మోహైన్‌, రసూల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T04:40:10+05:30 IST