ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-24T05:56:42+05:30 IST
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
పెనుగంచిప్రోలు, జనవరి 23: మండలంలోని లింగగూడెం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి బాణావత్ సునీల్ నాయక్ (21) ఏలూరులోని తన గదిలో శనివారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్టీసీ డ్రైవర్ బాణావత్ కొండ నాయక్ కుమారుడు సునీల్ నాయక్ ఏలూరులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. అదే కళాశాలలో చదువుతున్న పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి తిరుమలేష్ కుమార్ ఈ నెల నాలుగున ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే.