బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-23T05:32:45+05:30 IST

బెట్టింగ్‌ విషయంలో కుటుంబసభ్యులు మందలించారని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వడ్డేశ్వరంలో చోటుచేసుకుంది.

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ శ్రీనివాసరావు

బెట్టింగ్‌పై మందలించారని ఉరి

తాడేపల్లి, ఏప్రిల్‌ 22: బెట్టింగ్‌ విషయంలో కుటుంబసభ్యులు మందలించారని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వడ్డేశ్వరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు మంగళదాస్‌నగర్‌కు చెందిన ఆర్‌ విజయసాయి(20) అనే విద్యార్థి వడ్డేశ్వరంలోని ఓ యూనివర్సిటీలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా ఈ నెల 16న రాత్రి ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఆడుతుండగా విజయసాయి సోదరి గమనించి మందలించింది. దీంతో ఆమెపై కోపంతో విజయసాయి చెయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విజయసాయిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన విజయసాయి  వర్సిటీ సమీపంలోని సుదీక్ష రెసిడెన్స్‌ అపార్టుమెంట్‌లో  ఉంటున్న స్నేహితుడి రూమ్‌కు వెళ్లి గురువారం ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-04-23T05:32:45+05:30 IST