వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-16T06:28:51+05:30 IST
మండల పరిధి మర్తాడు గ్రామంలో బెస్త సుబ్బన్న, సుబ్బమ్మల కుమార్తె సుబ్బరత్నమ్మ (27) శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది.
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివాహం కాలేదని గార్లదిన్నె మండలానికి చెందిన ఓ యువతి, కుటుంబంలో మనస్పర్థలతో బ్రహ్మసముద్రం మండలానికి చెందిన ఓ వ్యక్తి, డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో రాయదుర్గం పట్టణానికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు.
వివాహం కాలేదని యువతి...
గార్లదిన్నె: మండల పరిధి మర్తాడు గ్రామంలో బెస్త సుబ్బన్న, సుబ్బమ్మల కుమార్తె సుబ్బరత్నమ్మ (27) శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. బీఎస్సీఈ, బీఈడీపూర్తి చేసిన ఆమెకు పలు సంబంధాలు చూసినా.. పెళ్లి కాలేదు. దీం తో జీవితంపై విరక్తి చెందిన ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పుత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ కిరణ్కుమార్రెడ్డి తెలిపారు.
కుటుంబ మనస్పర్థలతో...
బ్రహ్మసముద్రం: మండల పరిధి వేపులపర్తి గ్రామానికి చెంది న నాగేంద్ర (39) శుక్రవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలని అతను తన తండ్రి రంగప్పతో చర్చించాడు. కొత్త ఇల్లు వద్దని, ఉన్న ఇంటినే మరమ్మత్తులు చేసుకోవాలని రంగప్ప చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన నాగేంద్ర శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నాగేంద్ర భార్య సులోచన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని...
రాయదుర్గంటౌన్ : డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని పట్టణానికి చెందిన అష్వక్ (20) గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న అజ్మతుల్లా కుమారుడు అష్వక్ కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల వ చ్చిన పరీక్ష ఫలితాల్లో అతను ఫెయిల్ అయ్యాడు. దీంతో జీ వితంపై విరక్తి చెందిన అతను పట్టణ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు రైల్వే డివిజన్ పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.