అర్ధగిరిలో సుదర్శన హోమం
ABN , First Publish Date - 2020-07-06T11:08:34+05:30 IST
అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ పైమాఘం సురేంద్రారెడ్డి, ఈవో ..
తవణంపల్లె, జూలై 5: అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ పైమాఘం సురేంద్రారెడ్డి, ఈవో మునిశేఖర్ల ఆధ్వర్యంలో ఆదివారం పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో సుదర్శన హోమం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.