డీపీవో కృష్ణకుమారి ఆకస్మిక బదిలీ

ABN , First Publish Date - 2021-03-02T06:09:11+05:30 IST

జిల్లా పంచాయతీ అధికారిణి వి.కృష్ణకుమారికి బదిలీ అయ్యింది.

డీపీవో కృష్ణకుమారి ఆకస్మిక బదిలీ

విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా పంచాయతీ అధికారిణి వి.కృష్ణకుమారికి బదిలీ అయ్యింది. ఆమెను సంబంధిత శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆమె స్థానంలో తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రపురం ఎంపీడీవో ఎస్‌.సుభాషిణిని నియమించారు. కాగా ప్రస్తుత డీపీవో కృష్ణకుమారి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమెను ఆకస్మికంగా బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2021-03-02T06:09:11+05:30 IST