New York లో మెగా ఫ్యాషన్ ఈవెంట్.. భారత్ నుంచి పాల్గొన్న ఈ Sudha Reddy ఎవరంటే..

ABN , First Publish Date - 2021-09-16T02:22:37+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన మెట్ గాలా-2021 మెగా ఫ్యాషన్ ఈవెంట్ సందడిగా సాగింది.

New York లో మెగా ఫ్యాషన్ ఈవెంట్.. భారత్ నుంచి పాల్గొన్న ఈ Sudha Reddy ఎవరంటే..

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన మెట్ గాలా-2021 మెగా ఫ్యాషన్ ఈవెంట్ సందడిగా సాగింది. వివిధ దేశాల నుంచి పలువురు అందగత్తెలు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో మన దేశం నుంచి సుధారెడ్డి ఒక్కరే తళుక్కుమన్నారు. దీంతో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగిపోతోంది. అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై తళుక్కుమన్న ఈ సుధారెడ్డి ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు మన తెలుగు మహిళే. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణినే సుధారెడ్డి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ డైరెక్ట‌ర్ కూడా. ఇక ఈ ఈవెంట్‌లో ఆమె ధరించిన గౌను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 


ఇవి కూడా చదవండి..

America లో దారుణం.. శవాలుగా కనిపించిన భారతీయ విద్యార్థులు.. కారులో వెళ్తుండగా.. 

America లో సంచలన బిల్లు.. శృంగారం మధ్యలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్‌ను తొలగిస్తే..




అగ్రరాజ్యం జాతీయ పతాకాన్ని పోలిన ఈ గౌనును బంగారు రంగులో ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఏడాది థీమ్‌ అయినటువంటి ‘అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’కు తగ్గట్టుగా ఆ దేశ జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు ఫల్గుని, షేన్‌ పీకాక్‌ ఈ గౌనును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దీని తయారీకి ఏకంగా 250 గంటల సమయం పట్టిందని స్వయంగా డిజైనర్లే తెలియజేశారు. ఇలా ప్రత్యేక హంగులతో డిజైన్‌ చేసిన ఈ గౌనులో సుధారెడ్డి మెరిసిపోయారు. ఇక మెగా ఈవెంట్‌‌లో రెడ్ కార్పెట్‌పై ప్ర‌పంచ దేశాల నుంచి వచ్చిన సెల‌బ్రిటీలు తమ హొయ‌లతో ఫొటోల‌కు ఫోజులిస్తారు. అలాంటి ఈ భారీ ఈవెంట్‌లో ఈసారి భారత్ నుంచి ఆర్ట్‌, ఫ్యాష‌న్ అంటే చాలా ఇష్టపడే సుధా రెడ్డి మాత్రమే పాల్గొనడం విశేషం. మెట్‌ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం కూడా ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్‌ హీరోయిన్లు దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలతో పాటు ఇషా అంబానీ మాత్రమే పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-16T02:22:37+05:30 IST