దేశంలో తగినంత బొగ్గు లభ్యత ఉంది: కేంద్రం

ABN , First Publish Date - 2022-04-24T01:15:57+05:30 IST

దేశంలో తగినంత బొగ్గు లభ్యత ఉంది: కేంద్రం

దేశంలో తగినంత బొగ్గు లభ్యత ఉంది: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో తగినంత బొగ్గు లభ్యత ఉందని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. 72.50 మిలియన్ టన్నుల పొడి ఇంధనం వివిధ వనరులలో, 22 మిలియన్ టన్నులు థర్మల్ పవర్ ప్లాంట్లలో అందుబాటులో ఉందని చెప్పారు. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలు నెల రోజుల పాటు ఉంటాయని, ప్రతిరోజూ ఉత్పత్తి పుంజుకుంటోందని మంత్రి చెప్పారు. సింగరేణిలోని కోల్ ఇండియా లిమిటెడ్‌లోని వివిధ వనరులలో ప్రస్తుతం 72.50 ఎంటీ బొగ్గు అందుబాటులో ఉందని జోషి తెలిపారు. కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే మాట్లాడుతూ విద్యుత్ ప్లాంట్లకు సరఫరా చేయడానికి సరిపడా బొగ్గు ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విద్యుత్‌ను అందించకుండా కేంద్రాన్ని నిందించడంలో బిజీగా ఉందని ఆరోపించారు. మహారాష్ట్ర ఇంధన శాఖ మంత్రి నితిన్ రౌత్ గతంలో మాట్లాడుతూ రాష్ట్రంలో లోడ్ షెడ్డింగ్ పెరిగిందని అన్నారు.

Updated Date - 2022-04-24T01:15:57+05:30 IST