మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-25T04:56:23+05:30 IST
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
స్టేషన్ఘన్పూర్, జనవరి 24: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన వడ్లకొండ రాజు (32) ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది నెలలుగా ఆయన ఆరోగ్య సమస్యలతో పాటు, కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి స్టేషన్ఘన్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఆయనకు భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీఆర్పీఎఫ్ పోలీసులు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.