మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-25T04:56:23+05:30 IST

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

స్టేషన్‌ఘన్‌పూర్‌, జనవరి 24: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన వడ్లకొండ రాజు (32) ఆత్మహత్య చేసుకున్నాడు.  కొద్ది నెలలుగా ఆయన ఆరోగ్య సమస్యలతో పాటు, కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఆయనకు భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీఆర్పీఎఫ్‌ పోలీసులు మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-01-25T04:56:23+05:30 IST