పోలీస్ స్టేషన్‌ ఆవరణలో నిప్పంటించుకున్నాడు..

ABN , First Publish Date - 2021-02-28T04:52:38+05:30 IST

పోలీస్ స్టేషన్‌ ఆవరణలో నిప్పంటించుకున్నాడు..

పోలీస్ స్టేషన్‌ ఆవరణలో నిప్పంటించుకున్నాడు..
ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వ్యక్తి హరీష్‌

భార్య ఫిర్యాదు నేపథ్యంలో యువకుడి అఘాయిత్యం


చావుబతుకుల మధ్య ఎంజీఎంలో చికిత్స


ఖిలా వరంగల్‌, ఫిబ్రవరి 27: పోలీస్‌ స్టేషన్‌లో తనపై భార్య ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేక  గుండా హరీశ్‌ (35) అనే యువకుడు వరంగల్‌ నగరంలోని మిల్స్‌కాలనీ పోలీ్‌సస్టేషన్‌ ముందు శనివారం ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చావు బతుకుల మధ్య ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వరంగల్‌ అబ్బనికుంట ప్రాంతానికి చెందిన హరీశ్‌... కూరగాయల మార్కెట్‌లో ట్రాలీ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన హరీశ్‌... పనికి వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటుండడంతో భార్యతో తరుచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో భర్త తనను వేధిస్తున్నాడంటూ భార్య వనజ శనివారం మిల్స్‌కాలనీ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై విచారించేందుకు మిల్స్‌కాలనీ పోలీసులు హరీశ్‌ను పోలీస్‌ స్టేషన్‌కు రమ్మన్నారు.  దీంతో హరీశ్‌ పోలీసుస్టేషన్‌కు వస్తూ కిరోసిన్‌ సీసాను కూడా తెచ్చుకున్నాడు. స్టేషన్‌కు వచ్చిన తర్వాత ఆవరణలోనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుక ున్నాడు. అక్కడ ఉన్నవారు మట్టి పొసి మంటలను ఆర్పారు. వెంటనే పోలీసులు ఎంజీఎంకు తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో హరీశ్‌ చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. 


Updated Date - 2021-02-28T04:52:38+05:30 IST