అనంతపురం కలెక్టరేట్ దగ్గర ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-08-09T22:19:29+05:30 IST
అనంతపురం కలెక్టరేట్ దగ్గర కలకలం కలిగింది. పెట్రోల్ పోసుకుని కుటుంబం
అనంతపురం: అనంతపురం కలెక్టరేట్ దగ్గర కలకలం కలిగింది. పెట్రోల్ పోసుకుని కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం చేసింది. రెవెన్యూ అధికారులు తమ భూమిని ఇతరులకు బదలాయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సైతం అధికారులకే వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపించారు. స్పందన కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ ఎదుట మడకశిర మం. కోడిగానిపల్లికి చెందిన రామాంజనేయులు కుటుంబం బైఠాయించి ఆత్మహత్యాయత్నం చేసింది.