ఆ మైనర్లు ప్రేమించుకున్నారు... బాలికను అమ్మమ్మ ఇంటికి పంపించడంతో...

ABN , First Publish Date - 2022-06-28T17:37:06+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో మైనర్ ప్రేమ జంట...

ఆ మైనర్లు ప్రేమించుకున్నారు... బాలికను అమ్మమ్మ ఇంటికి పంపించడంతో...

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో మైనర్ ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఖమారియా గ్రామంలోని గౌసియాహ్వా పోఖ్రే సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్న 16 ఏళ్ల బాలిక, 17 ఏళ్ల బాలుని మృతదేహాలు కనిపించాయని పోలీసు అధికారి అంబికా రామ్ తెలిపారు. ఈ జంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టంనకు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. 


ఈ ఘటనతో గ్రామంలో కలకలం చెలరేగింది. ఆదివారం తన సోదరుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని మృతుని సోదరుడు తెలిపాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తాను ఫోన్ చేయడంతో అతను కట్ చేశాడన్నారు. అయితే సోదరుడు తనతో చాటింగ్ చేస్తూ... చాలా దూరం వెళ్తున్నానని, ఇక తిరిగి రానని మెసేజ్ చేశాడన్నారు. కాగా ఆ బాలిక ఈ బాలునితో పాటు ఒకే తరగతిలో చదువుకుంటోంది. వారిద్దరూ ఏడాదిగా ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం వీరిద్దరూ కలిసి ఒకేచోట కనిపించడంతో బాలిక కుటుంబ సభ్యులు ఆ బాలికను అమ్మమ్మ గ్రామమైన ఖమారియాకు పంపించారు. ఆదివారం వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తరువాతే వీరి మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు మైనర్లేనని పోలీసు అధికారి అంబికా రామ్ తెలిపారు. అమ్మాయికి 16 ఏళ్లు, అబ్బాయికి 17 ఏళ్లని తెలిపారు. ఈ జంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పోస్టుమార్టం కోసం తరలించారు. దీనికి సంబంధించిన రిపోర్టు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా మృతురాలి తల్లి ఇంతకుముందే మృతి చెందిందని, తండ్రి ముంబైలో పనిచేస్తున్నాడని ఇరుగుపొరుగు వారు తెలిపారు.

Updated Date - 2022-06-28T17:37:06+05:30 IST