యువతిపై దాడి చేసిన ఉన్మాది Suicide

ABN , First Publish Date - 2021-12-01T16:55:43+05:30 IST

అక్టోబర్‌ 28న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధి వట్టినాగులపల్లిలో ఓ యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఉన్మాది ఆత్మహత్య చేసుకున్నాడు. బయోర శ్యామ్‌సింగ్‌

యువతిపై దాడి చేసిన ఉన్మాది Suicide

హైదరాబాద్/జీడిమెట్ల: అక్టోబర్‌ 28న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధి వట్టినాగులపల్లిలో ఓ యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఉన్మాది ఆత్మహత్య చేసుకున్నాడు. బయోర శ్యామ్‌సింగ్‌, సరస్వతిల కుమారుడు ప్రేమ్‌సింగ్‌ (22) కూకట్‌పల్లి జేఎన్‌టీయూ సమీపంలోని ఎంఎన్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్నాడు. వీరి కుటుంబం జీడిమెట్ల పారిశ్రామికవాడ ప్రాంతంలోని ఎస్‌ఆర్‌నాయక్‌నగర్‌ జనప్రియ అపార్టుమెంట్‌లో నివాసముంటోంది. ప్రేమ్‌సింగ్‌ తన ప్రేమ కాదన్నదని అక్టోబర్‌ 28న అదే ప్రాంతానికి చెందిన యువతి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దారుణంగా పొడిచాడు.


ఈ ఘటనలో ప్రేమ్‌సింగ్‌కు కూడా గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత నెల 27న రాత్రి 10గంటలకు తల్లితో కలిసి ప్రేమ్‌సింగ్‌ భోజనం చేశాడు. చదువుకుంటానని తన గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు. నిత్యం ఫోన్‌ చూస్తూ రోజుల తరబడి గదిలోనే ఒంటరిగా ఉండటం ప్రేమ్‌సింగ్‌కు అలవాటు. దీంతో అతడి తల్లి సరస్వతి 28న ప్రేమ్‌సింగ్‌ గది తలుపు తట్టలేదు. 29న ఉదయం 11గంటల సమయంలో తలుపులు కొట్టి చూడగా ఎటువంటి శబ్ధం రాలేదు. దీంతో అనుమానం వచ్చి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి తలుపులు తెరిచారు. ప్రేమ్‌సింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-01T16:55:43+05:30 IST