ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి భర్త, అత్తామామల వేధింపులు..వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-19T16:06:53+05:30 IST

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న పాపానికి భర్త, అత్తామామల వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి...

ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి భర్త, అత్తామామల వేధింపులు..వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్/హైదర్‌నగర్‌: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న పాపానికి భర్త, అత్తామామల వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన పవిత్ర, ఖమ్మం జిల్లా వేంసూరు మండలంకు చెందిన బండి గౌతమ్‌ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు పవిత్రకు ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో ఆమె ప్రేమ విషయం బయటపడింది. గౌతమ్‌ గురించి తెలుసుకున్న పవిత్ర తల్లిదండ్రులు అతని తల్లిదండ్రులకు విషయం చెప్పారు. కానీ వారు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. గౌతమ్‌ తల్లిదండ్రులను ఎదిరించి పవిత్రను పెళ్లిచేసుకొని కేపీహెచ్‌బీ 5వ ఫేజ్‌లో ఉంటున్నాడు. కొద్దిరోజుల తర్వాత గౌతమ్‌ తల్లిదండ్రుల మాటలు వింటూ వచ్చాడు. అప్పటినుంచి గౌతమ్‌, అతని సోదరి, అతని తల్లిదండ్రులు.. పవిత్రను వేఽధించడం మొదలు పెట్టారు. దాంతో మనస్థాపం చెందిన పవిత్ర శనివారం సాయంత్రం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త గౌతమ్‌, ఆతని తల్లిదండ్రులు, సోదరి తన కూతురుని చంపేశారని వివాహిత తండ్రి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-19T16:06:53+05:30 IST