యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-25T05:50:46+05:30 IST

మండలంలోని గుంతనాల గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య కుమారుడు సురేంద్ర (20) శనివారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

యువకుడి ఆత్మహత్య

నంద్యాల (ఎడ్యుకేషన్‌), జూలై 24: మండలంలోని గుంతనాల గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య కుమారుడు సురేంద్ర (20) శనివారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి వెంకటసుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాలుకా పోలీసులు తెలిపారు. 



Updated Date - 2021-07-25T05:50:46+05:30 IST