టెక్కలిలో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-25T05:21:46+05:30 IST
స్థానిక ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న మొగలి పురి వినోద్(28) ఆది వారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెక్కలి పోలీసుల కథనం మేరకు...ఎన్టీఆర్కాలనీకి చెందిన మొగలిపురి చిదం బరేశ్వరరావు,లక్ష్మీ దంపతుల కుమారుడు వినోద్ స్థానికంగా ఆప్టింగ్ డ్రైవర్గాచేస్తున్నాడు.
టెక్కలి రూరల్, జనవరి 24: స్థానిక ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న మొగలి పురి వినోద్(28) ఆది వారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెక్కలి పోలీసుల కథనం మేరకు...ఎన్టీఆర్కాలనీకి చెందిన మొగలిపురి చిదం బరేశ్వరరావు,లక్ష్మీ దంపతుల కుమారుడు వినోద్ స్థానికంగా ఆప్టింగ్ డ్రైవర్గాచేస్తున్నాడు. అయితే వినోద్ తల్లికి మూడు రోజుల కిందట శస్త్రచికిత్స చేయడంతో ఆసుపత్రిలో ఉంది. తండ్రి స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తున్నారు. ఈ నేప థ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆది వారం రాత్రి వినోద్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థాని కులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.దీంతో టెక్కలి జిల్లాఆసుపత్రికి తరలించగా వైద్యుడు హెచ్.కిశోర్ పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. అయితే వినోద్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని టెక్కలి సీఐ ఆర్.నీలయ్య, ఎస్ఐ కామేశ్వరరావు పరిశీలించి కేసు నమోదు చేశారు.
యువకుడి హల్చల్...ఒకరిపై దాడి
టెక్కలి కొడ్రవీధికి చెందిన యువకుడు కిశోర్ ఆదివారం రాత్రి హల్చల్ చేశాడు. బాధితుడు, పోలీసుల కథనం మేరకు... కిశోర్ పలువురితో వాగ్వాదానికి దిగి శంభానవీధికి చెందిన వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజుపై మద్యం బాటిల్తో దాడి చేసి గాయపరిచాడు.దీంతో గాయపడిన ఆయన్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టెక్కలి సీఐ ఆర్.నీలయ్య, ఎస్ఐ ఎన్.కామేశ్వ రరావు వివరాలు సేకరించారు. దాడి చేసిన వ్యక్తి మానసికంగా ఇబ్బందిపడుతు న్నట్లు స్థానికులు చెబుతున్నారు. కిశోర్ ఆచూకీ కోసం పోలీసు