అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-06T07:53:44+05:30 IST

చంద్రగిరి పంచాయతీలోని జోగల కాలనీకి చెందిన శ్రీనివాసులు కుమారుడు గణేష్‌(27) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
ఆత్మహత్య చేసుకున్న గణేష్‌

చంద్రగిరి, మార్చి 5: చంద్రగిరి పంచాయతీలోని జోగల కాలనీకి చెందిన శ్రీనివాసులు కుమారుడు గణేష్‌(27) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్‌ శ్రీవారిమెట్టు మార్గం, తిరుమలలో ముగ్గు బుర్రల వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగించేవాడు.  కరోనా నేపఽథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం లేకుండా పోయింది. దీంతో చంద్రగిరిలోనే కూలి పనులు చేసుకొంటున్నాడు. అయితే కరోనా సమయంలో అప్పులు చేశాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో గురువారం సాయంత్రం గణేష్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించి, భార్య ఆశా, చుట్టు ప్రక్కల వారు ఇంటి తలుపులు పగలగొట్టి గణే్‌షని కిందకు దింపి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.

Updated Date - 2021-03-06T07:53:44+05:30 IST