ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-24T07:12:43+05:30 IST

మండలంలోని గర్గుల్‌ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య


కామారెడ్డి, జూలై 23: మండలంలోని గర్గుల్‌ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. గ్రామానికిచెందిన గోట్టి గట్టయ్య ( 48) అనే వ్యక్తి కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పాయిజన్‌ తీసుకుని గురువారం ఆత్మహత్యా యత్నం చేయగా కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. దీంతో మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి భార్య విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-24T07:12:43+05:30 IST