కేసీఆర్ హిట్ల‌ర్ పాల‌న..టీఆర్ఎస్ నేతల వేధింపులతో ఆత్మహత్యలు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-04-19T21:37:45+05:30 IST

కేసీఆర్ హిట్ల‌ర్ పాల‌న..టీఆర్ఎస్ నేతల వేధింపులతో ఆత్మహత్యలు: విజయశాంతి

కేసీఆర్ హిట్ల‌ర్ పాల‌న..టీఆర్ఎస్ నేతల వేధింపులతో ఆత్మహత్యలు: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణ‌లో న‌యా నిజాం నిర‌ంకుశ పాల‌న కొనసాగుతోందని, రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా సామాన్యుల‌కు అన్యాయం చేస్తూ కేసీఆర్ హిట్ల‌ర్ పాల‌న చేస్తున్నాడని విజయశాంతి విమర్శించారు. కేసీఆర్ బాట‌లోనే టీఆర్ఎస్ నాయకులు కూడా న‌డుస్తున్నారని, అమాయ‌కుల‌ను బెదిరిస్తూ... ఆత్మ‌హ‌త్య‌లకు పాల్పడేలా చేస్తున్నారని, టీఆర్ఎస్ నాయకుల వేధింపులు తాళ‌లేక ఖ‌మ్మం, కామారెడ్డిలో అమాయ‌కులు ఆత్మహత్యలు చేసుకున్నారని విజయశాంతి ఆరోపించారు. రాములమ్మ సోషల్ మీడియాలో పోస్టు యథాతథంగా..


''తెలంగాణ‌లో న‌యా నిజాం నిర‌ంకుశ పాల‌న కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా సామాన్యుల‌కు అన్యాయం చేస్తూ కేసీఆర్ హిట్ల‌ర్ పాల‌న చేస్తుండు. కేసీఆర్ బాట‌లోనే టీఆర్ఎస్ నాయకులు కూడా న‌డుస్తున్నరు. అమాయ‌కుల‌ను బెదిరిస్తూ... ఆత్మ‌హ‌త్య‌లకు పాల్పడేలా చేస్తున్నరు. టీఆర్ఎస్ నాయకుల వేధింపులు తాళ‌లేక ఖ‌మ్మం, కామారెడ్డిలో అమాయ‌కులు ఆత్మహత్యలు చేసుకున్నరు.  బంగారు తెలంగాణ అంటే ఇదేనా? నాయ‌కులంటే ప్ర‌జ‌ల బాధలు తీర్చాలి కానీ, టీఆర్ఎస్ నాయకులు మాత్రం లేని బాధ‌ల‌ను సృష్టిస్తున్నరు. ఇది ఎంత వ‌ర‌కూ సమంజ‌సం? వీరికి నాయ్యం జ‌రిగే వ‌ర‌కూ పోరాటం చేస్తం. బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాలని బీజేపీ పార్టీ త‌రఫున‌ డిమాండ్ చేస్తున్నం. అమాయకులు ఆత్మహత్య చేసుకునేలా టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నరు. మరణ వాంగ్మూలం తీసుకుంటే స్థానిక మంత్రి, టీఆర్ఎస్ నేతలపై హత్య కేసు నమోదు చేయాల్సి వస్తుందనే భయంతోనే మరణ వాంగ్మూలం నమోదు చేయలేదు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నరు. మంత్రి, పోలీసులపై తక్షణం హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. బీజేపీ కార్యకర్తల, యువకుల శోకానికి ఫలితం అనుభవించక తప్పదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టం. కచ్చితంగా చ‌ట్ట ప్ర‌కారం శిక్షిస్తాం. అమాయ‌కుల ప్రాణాలు బలి తీసుకుంటున్న కేసీఆర్ స‌ర్కారుకు ఆ దేవుడే త‌గిన శాస్తి చేస్తాడు.'' అని విజ‌య‌శాంతి అన్నారు.



Updated Date - 2022-04-19T21:37:45+05:30 IST