తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు ఆగిపోయాయి: కేసీఆర్

ABN , First Publish Date - 2021-10-18T21:41:03+05:30 IST

తెలంగాణ వచ్చాక విద్యుత్ సమస్యను పరిష్కరించుకున్నామని, రైతు, చేనేత ఆత్మహత్యలు ఆగిపోయాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు ఆగిపోయాయి: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ వచ్చాక విద్యుత్ సమస్యను పరిష్కరించుకున్నామని, రైతు, చేనేత ఆత్మహత్యలు ఆగిపోయాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి మోత్కుపల్లిని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ నేతలందరినీ ఒప్పించి స్వరాష్ట్రం సాధించామని చెప్పారు. తెలంగాణలో సమస్యలు కొలిక్కి వస్తున్నాయన్నారు. ఇప్పుడు గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని, తెలంగాణలో జరగాల్సింది ఇంకా ఉందని అభిప్రాయపడ్డారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికే దళిత బంధు పథకాన్ని తెచ్చామని తెలిపారు. దళిత బంధు.. దళితులతోనే ఆగిపోదని, బీసీ, ఇతర వర్గాలకు కూడా వర్తింపజేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

Updated Date - 2021-10-18T21:41:03+05:30 IST