పురుగుల మందుతాగి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-15T05:54:04+05:30 IST
ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది.
తిరుమలాయపాలెం, మే 14: ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడు శివారు సీత్లాతండాకు చెందిన మాళోతు రాందాస్(24) తిరుమలాయపాలెంలో మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు. ఈవిషయమై యువతి స్థానిక పోలీసుస్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువకుడు గురువారం యువతి గ్రామానికి వెళ్లి పురుగుల మందుతాగి ఆత్మహత్యయత్న చేశాడు. వెంటనే యువకుడిని మరిపెడబంగ్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలో ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాందాస్ తల్లిదండ్రుల స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశారు.