ఆ రెండు ఘటనలు ఏపీలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ట: సుజనా చౌదరి

ABN , First Publish Date - 2021-12-21T16:40:01+05:30 IST

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆ రెండు ఘటనలు ఏపీలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ట: సుజనా చౌదరి

అమరావతి: బీజేపీ ఎంపీ సుజనా చౌదరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనలు ఏపీలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ట అని అన్నారు. సీఎం, మంత్రులు, ఎంపీల పేర్లతో  బెదిరించడం, కబ్జాలకు పాల్పడడం రివాజుగా మారిందని ఆరోపించారు. ఇలాంటి ఘటనలను ముఖ్యమంత్రి జగన్ తక్షణమే అరికట్టాలన్నారు. బాధితులు వేధింపులకు భయపడకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కాపీలు తనకు పంపించాలన్నారు. బాధితులకు అండగా ఉంటానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. మెయిల్‌ను saveandhrapradesh2022@gmail.comకు చేయాలని సూచించారు.

Updated Date - 2021-12-21T16:40:01+05:30 IST