అయోధ్య రామమందిర నిర్మాణానికి సుజనా కుటుంబం భారీ విరాళం

ABN , First Publish Date - 2021-01-25T01:05:43+05:30 IST

అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎంపీ సుజనా చౌదరి కుటుంబం తరపున రూ.2.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తన తండ్రి యలమంచిలి జనార్థనరావు

అయోధ్య రామమందిర నిర్మాణానికి సుజనా కుటుంబం భారీ విరాళం

హైదరాబాద్: అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎంపీ సుజనా చౌదరి కుటుంబం తరపున రూ.2.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తన తండ్రి యలమంచిలి జనార్థనరావు పేరు మీద రూ. 2 కోట్ల 2 లక్షల 32 వేలు సుజనాచౌదరి ఇచ్చారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రూ.5 లక్షల విరాళం, సీసీఎల్‌ గ్రూప్ రూ.6 కోట్ల 39 లక్షల విరాళం, సిద్ధార్థ అకాడమీ తరపున రూ.15 లక్షల విరాళాన్ని ఇచ్చారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం రూ.10, రూ.100, రూ.1000 కూపన్లను ముద్రించారు. రూ.2 వేలు, ఆ పైన ఇచ్చే విరాళాలకు రశీదు ఇస్తున్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు నిధుల సమీకరణ చేస్తామని విశ్వహిందూ పరిషత్‌ నేతలు ప్రకటించారు. 

Updated Date - 2021-01-25T01:05:43+05:30 IST