వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-18T05:04:54+05:30 IST

ఇందుకూరుపేట, మైపాడు గ్రంథాలయాల్లో మంగళవారం వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రారంభమయ్యాయి. జూన్‌ 30వతేదీ వరకు విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిక్షణ నిర్వహిస్తున్నట్లు లైబ్రేరియన్లు కలికి కె.మంజులత, సుజాత తెలిపారు.

వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రారంభం
ఇందుకూరుపేట : వేసవి విజ్ఞాన శిబిరానికి వచ్చిన విద్యార్థులు

ఇందుకూరుపేట, మే 17 : ఇందుకూరుపేట, మైపాడు గ్రంథాలయాల్లో మంగళవారం వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రారంభమయ్యాయి. జూన్‌ 30వతేదీ వరకు విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిక్షణ నిర్వహిస్తున్నట్లు లైబ్రేరియన్లు కలికి కె.మంజులత, సుజాత  తెలిపారు. ప్రతిరోజూ విద్యార్థులచే కథలు చెప్పించడం, వినిపించడం, పుస్తక పఠనం, చిత్రలేఖనం వంటి వాటినిఇ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Updated Date - 2022-05-18T05:04:54+05:30 IST