దుర్గాభోగేశ్వరుడిని తాకిన సూర్య కిరణాలు

ABN , First Publish Date - 2021-11-29T05:46:58+05:30 IST

కర్నూలు జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన గడివేముల మండలంలోని దుర్గాభోగేశ్వరుడి ఆలయంలో ఆదివారం ఉదయం 6.50 గంటలకు సూర్యకిరణాలు ఉద యం గర్భగుడిలోని దుర్గాభోగేశ్వరుడిపై ప్రసరించాయి.

దుర్గాభోగేశ్వరుడిని తాకిన సూర్య కిరణాలు

గడివేముల, నవంబరు 28: కర్నూలు జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన గడివేముల మండలంలోని దుర్గాభోగేశ్వరుడి ఆలయంలో ఆదివారం ఉదయం 6.50 గంటలకు సూర్యకిరణాలు ఉద యం గర్భగుడిలోని దుర్గాభోగేశ్వరుడిపై ప్రసరించాయి. ప్రతి ఏడాది కార్తీకమాసం ఆరుద్ర నక్షత్రం తరువాత భోగేశ్వరుడిపై సూర్యకిరణాలు ప్రసరించడం ప్రారంభమయ్యేది. ఈ ఏడాది తుపాను ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉండటంతో సూర్యకిరణాలు భోగేశ్వరుడిపై ఆలస్యంగా పడినట్లు ఆలయ అర్చకులు శ్యాంసుందర్‌శర్మ తెలిపారు. జనమేజయ మహారాజు కాలంలో నిర్మించిన భోగేశ్వరంలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఈ అపురూపదృశ్యం ఆవిస్కృతమవుతోంది. సూర్యకిరణాలు ప్రారంభంలో శివలింగం పైభాగంలో తాకి రోజు రోజుకు పెరుగుతూ లింగమంతా ప్రసరిస్తాయి. ఆ తరువాత క్రమంగా తగ్గుతాయి. సూర్యకిరణాలు దుర్గాభోగేశ్వరుడిపై ప్రసరించే సమయంలో పూజలు చేస్తే భోగేశ్వరుడికి, సూర్య భగవానుడికి పూజలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని అర్చకులు శ్యాంసుందర్‌శర్మ పేర్కొన్నారు. భక్తులకు ఈ దృశ్యం పది రోజుల పాటు కనువిందు చేస్తుందని ఆయన వివరించారు. 



Updated Date - 2021-11-29T05:46:58+05:30 IST