Breaking: తన తండ్రి హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైయస్ వివేకా కూతురు సునీత రెడ్డి

ABN , First Publish Date - 2022-08-12T22:54:55+05:30 IST

Amaravathi: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పర్యవేక్షణలో సిబిఐ కేసు విచారణ చేపట్టినా... ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని అని పిటిషన్లో పేర్కొన్నారు.ఇకపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరిగేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏపీలో న్యాయం జరగకపోవడమే కాకుండా, తీవ్ర జాప్యం

Breaking: తన తండ్రి హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైయస్ వివేకా కూతురు సునీత రెడ్డి

Amaravathi: వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda) హత్య కేసులో ఆయన కూతురు సునీత రెడ్డి (Suneeta Reddy) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పర్యవేక్షణలో  సీబీఐ కేసు విచారణ చేపట్టినా... ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇకపై సుప్రీంకోర్టు (Supreme Court) పర్యవేక్షణలో కేసు విచారణ జరిగేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏపీలో న్యాయం జరగకపోవడమే కాకుండా, తీవ్ర జాప్యం అయ్యే అవకాశాలున్నాయని,  వేరే రాష్ట్రానికి వివేకా కేసు విచారణను తరలించాలని కూడా పిటీషన్‌లో సునీతా కోరారు. సునీతారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సీబీఐని ప్రతివాదులుగా చేర్చిన నేపథ్యంలో ఆమె పిటీషన్ త్వరలో విచారణకు రానుంది. 

Updated Date - 2022-08-12T22:54:55+05:30 IST