ధరల పెరుగుదలతో ప్రజలు బతికే పరిస్థితి లేదు : సునీత రావు

ABN , First Publish Date - 2022-04-12T19:16:36+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు అన్నారు.

ధరల పెరుగుదలతో ప్రజలు బతికే పరిస్థితి లేదు : సునీత రావు

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు అన్నారు. మంగళవారం నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సునీత రావు మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ చార్జీలు తగ్గించకపోతే మరోసారి విద్యుత్ సౌధకి పోదామని చెప్పారు. ఈ కేబినెట్ సమావేశంలో పెంచిన ధరలు, ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని సునీత రావు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-12T19:16:36+05:30 IST