కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోండి
ABN , First Publish Date - 2021-06-18T05:27:54+05:30 IST
కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోండి
ఇచ్ఛాపురం: కరోనాబారిన పడి మృతి చెందిన కుటుంబసభ్యులతోపాటు ఉపాధి కోల్పోయిన పేదలకు ఆదుకోవాలని టీడీపీ పట్టణాధ్యక్షుడు కాళ్ల ధర్మారావు, రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీయాదవ్ కోరారు. ఈమేరకు గురువారం ఇచ్ఛాపురంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ మురళీమోహనరావుకు వినతిపత్రం అందజేశారు. కరోనా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు, ఉపాధి కోల్పోయిన పేదలకు రూ.10 వేలు అందించాలని కోరారు. బ్లాక్ఫంగస్ మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు డిమాండ్చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డి.ఢిల్లీరావు, నాయకులు ఎ.లీలారాణి, ధర్మరాజు, దిలీప్ పాల్గొన్నారు.