బాధిత రైతులను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-11-26T05:18:55+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు ఆదుకోవాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. ఈమేరకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు గురువారం లేఖ రాశారు.

బాధిత రైతులను ఆదుకోండి

ఎమ్మెల్యే ఏలూరి


పర్చూరు, నవంబరు 25: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు ఆదుకోవాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. ఈమేరకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు గురువారం లేఖ రాశారు. పర్చూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో పైరుకు నష్టం వాటిల్లిందని తెలిపారు.  తక్షణమే సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పర్చూరు,  ఇంకొల్లు, మార్టూరు, యద్దనపూడి, కారంచేడు, చినగంజాం మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రధానంగా మిరప, పొగాకు, ప్రత్తి, మినుము, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఏలూరి పేర్కొ న్నారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలతో ఎక్కువ రోజులు పంటలు నీటమునిగి ఉండటంతో వేళ్లు కుళ్లిపోయి మొక్కలు ఎండిపోతున్నాయని తెలిపారు. అన్నిగ్రామాల్లో పైరు నష్టం స ర్వే చేయించి రైతులను ఆదుకోవాలని కోరారు. దీంతోపాటు రై తులు తిరిగి సాగుచేసుకొనేందుకు విత్తనాలు, ఎరువులను సబ్సి డీపై అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 


Updated Date - 2021-11-26T05:18:55+05:30 IST