ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-06-22T06:31:19+05:30 IST

కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలని విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.

ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోండి
జేసీ రాజశేఖర్‌కు వినతిపత్రం ఇస్తున్న విపక్ష నాయకులు

విపక్ష నేతల డిమాండ్‌


చిత్తూరు, జూన్‌ 21: కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలని విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ రాజశేఖర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ.. కరోనా కారణంగా కోటి మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. ఇప్పటికైనా బియ్యం కార్డున్న వారికి, ప్రైవేటు టీచర్లు, భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు, వృత్తిదారులకు రూ.10వేలను ఇవ్వాలన్నారు. అలాగే వైరస్‌తో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అకాలవర్షానికి నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో.. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, సత్యవేడు టీడీపీ అధ్యక్షుడు జేడీ రాజశేఖర్‌, సీపీఎం నాయకుడు కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రటరీ లోకేష్‌రెడ్డి తదితరులున్నారు. 

Updated Date - 2021-06-22T06:31:19+05:30 IST