మద్దతు ధర అందేలా చూడండి
ABN , First Publish Date - 2021-05-11T04:42:48+05:30 IST
రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని రామచంద్రపురం ఆర్డీవో సింధు ఆదేశించారు. దంగేరు రైతు భరోసా కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు.
కె.గంగవరం,
మే 10: రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని రామచంద్రపురం ఆర్డీవో సింధు
ఆదేశించారు. దంగేరు రైతు భరోసా కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు.
ధాన్యం కొనుగోలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. తేమ శాతం
పరీక్షించే యంత్రాల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం రికార్డులు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయకుడు కర్రి శ్రీరామచంద్రమూర్తి, సొసైటీ
సిబ్బంది పాల్గొన్నారు.