Supreme Court: మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2022-09-12T19:39:47+05:30 IST

మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Supreme Court: మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు

ఢిల్లీ (Delhi): మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ (Konatala Ramakrishna)కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కొణతాల పిటిషన్‌ను సుప్రీంకు బదిలీ చేయాలని కేంద్రం పిటిషన్ వేసింది. విభజనకు సంబంధించి సుప్రీంలో దాఖలైన అనేక పిటిషన్లతో పాటు.. కొణతాల పిటిషన్‌పై విచారణ జరపాలని కేంద్రహోంశాఖ వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సీజేఐ లలిత్ ధర్మాసనం.. కొణతాలకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2022-09-12T19:39:47+05:30 IST