Supreme Court: ఎన్నికల్లో దోషుల పోటీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో విచారణ

ABN , First Publish Date - 2022-09-12T21:44:54+05:30 IST

వివిధ కేసుల్లో దోషులుగా తేలిన వారిని ఎన్నికల్లో.. పోటీచేసే అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో..

Supreme Court: ఎన్నికల్లో దోషుల పోటీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో విచారణ

ఢిల్లీ (Delhi): వివిధ కేసుల్లో దోషులుగా తేలిన వారిని ఎన్నికల్లో.. పోటీచేసే అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court)లో పూర్తి విచారణ చేయడానికి సీజేఐ (CJI) ధర్మాసనం  సుముఖత వ్యక్తం చేసింది. 2016 నుంచి ఈ పిటిషన్ (Petition) సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. దోషులుగా తేలిన నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయడం, పార్టీలో కీలక పదవుల్లోకి.. రావడంపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ 2016లో పిల్ దాఖలైంది. పిల్‌ను విచారించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. త్వరలో విచారణ తేదీని ప్రకటిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

Updated Date - 2022-09-12T21:44:54+05:30 IST