వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలనే పిటిషన్పై విచారణకు సుప్రీం సుముఖత
ABN , First Publish Date - 2022-09-12T19:50:22+05:30 IST
వివిధ కేసుల్లో దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు
Delhi : వివిధ కేసుల్లో దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో(Elections) పోటీ చేయకుండా నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సీజేఐ(CJI) ధర్మాసనం సుముఖత వ్యక్తం చేసింది. దోషులుగా తేలిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించే అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court) పూర్తి విచారణ చేయనుంది. 2016 నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది. దోషులుగా తేలిన నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయడం, రాజకీయ పార్టీ కీలక పదవుల్లోకి రావడంపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ 2016లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. త్వరలో విచారణ తేదీని ప్రకటించనున్నట్లు ధర్మాసనం పేర్కొంది.