బోర్డు ప‌రీక్షల రద్దు పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌

ABN , First Publish Date - 2021-06-22T22:26:45+05:30 IST

బోర్డు ప‌రీక్షల రద్దు పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌

బోర్డు ప‌రీక్షల రద్దు పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌

ఢిల్లీ/అమరావతి: రాష్ట్రాల బోర్డు ప‌రీక్షల రద్దు పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల రద్దుపై అఫిడవిట్ రెండు రోజుల్లో సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని రాష్టాలు పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఏపీకి ఎందుకు అనిశ్చితి నెలకొందని కోర్టు ప్రశ్నించింది. పరీక్షలకు వెళ్లాలనుకుంటే పూర్తి వివరాలను అఫిడవిట్‌లో తెలపాలని సూచించింది. పరీక్షల నిర్వహణతో ఒక్క మరణం సంభవించినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ధర్మాసనం పేర్కొంది. ప‌రీక్షల ర‌ద్దుకు సిద్ధంగా ఉన్నట్టు అసోం, పంజాబ్‌, త్రిపుర బోర్డులు వెల్లడించాయి. ఇప్పటి వ‌ర‌కు 21 రాష్ట్రాలు బోర్డు ప‌రీక్షల‌ను రద్దు చేశాయి. 11వ తరగతి పరీక్షలు సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం తెలిపింది

Updated Date - 2021-06-22T22:26:45+05:30 IST