సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2022-05-29T06:03:43+05:30 IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు హైకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులు జూన్‌ 1న అరకులోయ రానున్న నేపథ్యంలో ఆ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, జిల్లా ఎస్‌పీ సతీశ్‌కుమార్‌ శనివారం పరిశీలించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
టూరిజం హరితవేలీ రిసార్టును సందర్శించి ఎస్‌పీతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

అరకులోయ, మే 28: సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు హైకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులు జూన్‌ 1న అరకులోయ రానున్న నేపథ్యంలో ఆ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, జిల్లా ఎస్‌పీ సతీశ్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. పర్యాటక శాఖకు చెందిన హరిత వేలీ రిసార్టు, అరకు రైల్వే స్టేషన్‌, అరకు రైల్వే అతిథి గృహాన్ని డీపీవో కుమార్‌, స్థానిక అధికారులతో కలిసి వారు పరిశీలించారు. న్యాయమూర్తులు విశ్రాంతి తీసుకునేందుకు రైల్వే అతిథి గృహాన్ని ఎంపిక చేయడంతో అక్కడి సౌకర్యాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. తిరుగు ప్రయాణంలో అరకు నుంచి విశాఖపట్నానికి రైలులో వెళుతున్నందున రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ అడపా వేణుగోపాల్‌, ఎంపీడీవో రాంబాబు, మ్యూజియం మేనేజర్‌ మురళి, సీఐ జీడీ బాబు తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-05-29T06:03:43+05:30 IST