‘‘ఏపీ ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే చర్యలు తీసుకోవాలి’’
ABN , First Publish Date - 2020-12-03T02:29:55+05:30 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు లేఖ రాశారు. రాష్ట్రాల కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు ...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు లేఖ రాశారు. రాష్ట్రాల కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడంపై ఆయన అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశారు. దీని వల్ల ఆర్థిక పురోగతి కుంటుపడటమే కాకుండా అభివృద్ధి క్షీణిస్తుందని సురేష్ ప్రభు లేఖలో పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ను దాటి సంక్షేమ పథకాలకు ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని సురేష్ ప్రభు సూచించారు.