రాజ్యసభ రూల్స్‌ కమిటీ సభ్యుడిగా సురేశ్‌ రెడ్డి

ABN , First Publish Date - 2021-04-23T07:53:12+05:30 IST

రాజ్యసభ రూల్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డి నియమితులయ్యారు.

రాజ్యసభ రూల్స్‌ కమిటీ సభ్యుడిగా సురేశ్‌ రెడ్డి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ రూల్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీ సభ్యుడిగా ఉన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ లక్ష్మికాంతరావును తప్పించారు. వివిధ స్థాయీ సంఘాలను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు పునర్వ్యవస్థీకరించారు. సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న సురేశ్‌రెడ్డి స్థానంలో ఎంపీ బండా ప్రకాశ్‌ని నియమించారు. పిటిషన్ల కమిటీ నుంచి టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్‌ను తప్పించి పేపర్స్‌ లెయిడ్‌ ఆన్‌ టేబుల్‌ కమిటీ సభ్యునిగా నియమించారు. హౌజ్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ లింగయ్య యాదవ్‌ నియమితులయ్యారు. కాగా, బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌, విలువల కమిటీ సభ్యుడిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, విలువల కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు, రూల్స్‌ కమిటీ సభ్యుడిగా ఎంపీ సుజనా చౌదరి, ప్రివిలేజ్‌ కమిటీ సభ్యుడిగా జీవీఎల్‌ నరసింహా రావును కొనసాగించారు.

Updated Date - 2021-04-23T07:53:12+05:30 IST