డీజీపీ పైనే నిఘా!

ABN , First Publish Date - 2021-07-27T07:28:11+05:30 IST

డీజీపీ నేతృత్వంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ సీఎం జగన్మోహన్‌రెడ్డి కనుసన్నల్లో పని చేస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు

డీజీపీ పైనే నిఘా!

జగన్‌ కనుసన్నల్లోనే శాంతిభద్రతలు

సవాంగ్‌.. కోర్టు బోనులో నిలబడక తప్పదు 

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా


విజయవాడ, జూలై 26(ఆంధ్రజ్యోతి): డీజీపీ నేతృత్వంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ సీఎం జగన్మోహన్‌రెడ్డి కనుసన్నల్లో పని చేస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. జగన్‌ ఏది చెబితే అది చేయడమే డీజీపీ విధిగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్‌ చెప్పిందల్లా చేయబట్టే.. నేడు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పరిస్థితే ప్రశ్నార్థకంగా మారిందని, ఆయనపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా పెట్టాయని పోలీసులే చెప్పుకుంటున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో ఆయన ఆలోచించుకోవాలని హితవు పలికారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో వెంకన్న సోమవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీతో సహా ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులకు డీజీపీ ఏనాటికైనా సమాధానం చెప్పాల్సిందేనన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మర్నాడే సవాంగ్‌ ఎక్కడున్నాసరే తాను చేసిన తప్పులకు కోర్టు బోనులో నిలబడక తప్పదని హెచ్చరించారు.

Updated Date - 2021-07-27T07:28:11+05:30 IST