ఎస్బీఐ ఏటీంలో చోరీకి యత్నం
ABN , First Publish Date - 2020-11-23T13:52:38+05:30 IST
జిల్లాలోని చింతలపాలెం మండలం దొండపాడు ఎస్బీఐ ఏటీఎంలో చోరికి దుండగులు విఫలయత్న చేశారు.
సూర్యాపేట: జిల్లాలోని చింతలపాలెం మండలం దొండపాడు ఎస్బీఐ ఏటీఎంలో చోరికి దుండగులు విఫలయత్న చేశారు. ఏటీఎం మిషన్ తెరుచుకోకపోవడంతో దుండగులకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుండగుల చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు.